Wednesday, April 24, 2024

జైపూర్ లీలా ప్యాలెస్ లో.. శ‌ర్వానంద్ వివాహం

రాజ‌స్థాన్ జైపూర్ లీలా ప్యాలెస్ లో హీరో శ‌ర్వానంద్ వివాహం జ‌ర‌గ‌నుంది.ఈ ప్యాలెస్‌లో రెండు రోజుల పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. జూన్‌ 2న మెహిందీ ఫంక్షన్‌ నిర్వహించనున్నారు. జూన్ 3న వివాహ వేడుక జరగనుండగా.. టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో సందడి చేయబోతున్నారట. ఇప్పటికే వెడ్డింగ్‌ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని ఇన్‌సైడ్‌ టాక్‌. రక్షితారెడ్డి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని కాగా ఆమె తండ్రి మధుసూదన రెడ్డి హైకోర్టు లాయర్‌. శ్రీరామ్‌ ఆదిత్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు శర్వానంద్‌. ప్రస్తుతం శర్వానంద్‌ వెడ్డింగ్‌ పనులపై ఫోకస్ పెట్టార‌ట. వెడ్డింగ్ తర్వాత సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు టాక్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement