Tuesday, April 30, 2024

కోరుట్ల ఎస్బీఐ ఎటిఎం లో చోరి…

కోరుట్ల పట్టణంలో దుండగులు సినీఫక్కీలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం నుంచి డబ్బులు తీస్తుండగా అందులో ఉన్న అల్లారం మోగింది. దీంతో అప్రమత్తమైన పెట్రోలింగ్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే డబ్బును పెట్టెల్లో పెట్టుకున్న దొంగలు కారులో ఎక్కుతుండగా పెట్రోలింగ్‌ వాహనం అక్కడికి చేరుకున్నది. గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి డబ్బుల బాక్స్‌ రోడ్డుపై పడిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనం దానిని గుద్దేయడంతో అందులో ఉన్న డబ్బు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సుమారు రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు దొంగలను పట్టుకోవడానికి యత్నించినప్పటికీ చిక్కకుండా పారిపోయారు. ఈ చోరికి మొత్తం న‌లుగురు ప్ర‌య‌త్నించిన‌ట్లు పోలీసులు గుర్తించారు..స్వాధీనం చేసుకున్న రూ.19 ల‌క్ష‌లు పోనూ ఇంకా ఎంత మొత్తం చోరికి గురైంద‌నే విష‌యాన్ని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు..ఎస్బీఐ అధికారుల నుంచి వివ‌రాలు సేక‌రిస్తున్నారు పోలీసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement