Thursday, May 2, 2024

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి.. రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి

పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎల్లవేళలా పోలీస్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రూపేష్, ఏసీపీలు గిరి ప్రసాద్, మోహన్, బాలరాజు, సుందర్ తో పాటు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement