Tuesday, May 7, 2024

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను భావి తరాలకు చాటి చెప్పాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను భావి తరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రసూతి వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బాలింతలకు కేసీఆర్‌ కిట్‌లను మంత్రి ఈశ్వర్‌ పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలతోనే స్వేచ్ఛా భారతంలో మనమంతా జీవిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సుపరిపాలన సాగుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement