Friday, May 17, 2024

కుప్ప కూలిన మూడంత‌స్తుల భ‌వ‌నం – త‌ప్పిన ప్ర‌మాదం

మూడంత‌స్తుల భ‌వ‌నం కుప్ప కూలింది.ఈ సంఘ‌ట‌న దేశ ఆర్ధిక రాజ‌ధాని ముంబైలోని బొరివ‌లి (వెస్ట్‌) ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం, గాయ‌ప‌డిన వివ‌రాలు వెల్ల‌డికాక‌పోవ‌డంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
సాయిబాబా న‌గ‌ర్‌లోని సాయిబాబా ఆల‌యం స‌మీపంలోని గీతాంజ‌లి బిల్డింగ్ కూలిపోయింది. ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్న మెట్ర‌పాలిట‌న్ ఫైర్‌, ఎమ‌ర్జెన్సీ సేవ‌ల మండ‌లి, పోలీస్ సిబ్బంది స‌హాయక చ‌ర్య‌ల‌ను ప్రారంభించారు. ఎవ‌రికీ ఎటువంటి హ‌నీ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement