Monday, April 29, 2024

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం.. ఎస్సై మహేందర్

శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని పెద్దపల్లి ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు 24 గంటల పాటు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకారం అందించాలని, ఎలాంటి సమస్యలున్నా.. నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. మహిళా రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తాయని, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్సై మహేందర్ కు బదిలీపై వెళ్తున్న ఎస్ఐ రాజేష్ తో పాటు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement