Sunday, May 5, 2024

క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి.. పెద్దపల్లి ఏసీపీ మహేష్

క్రీడల్లో గెలుపోటములు సమానంగా తీసుకొని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని పెద్దపల్లి ఏసీపీ మహేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో జరుగుతున్న కేసీఆర్ క్రికెట్ కప్ పోటీల్లో భాగంగా క్వాటర్ ఫైనల్స్ మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు. క్రీడా పోటీల వల్ల క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యం బహిర్గతమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ తోపాటు నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement