Tuesday, April 30, 2024

బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..

మంచిర్యాల : జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మహేష్ అనే దళిత యువకుడు ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా యువకులు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ ఆత్మహత్య లేనని బీజేవైఎం వెల్దండ శాఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుని పిలుపుమేరకు, బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు.

కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో నిరుద్యోగులు.. ఆత్మహత్యలు తప్ప యువతకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ రాలేద‌న్నారు. అన్ని మండల బీజేవైఎం అధ్యక్షుడు కంఠం రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మహేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రాజేందర్రెడ్డి, రమేష్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement