Sunday, April 28, 2024

శబరిమలైకి స్వాముల పయనం..

ముస్తాబాద్‌: అయ్యప్పస్వామి వారి కృపాకటాక్షాలకు పాత్రులు కావడానికి ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటూ కఠినమైన దీక్ష, నిష్ఠలతో 41 రోజుల మండల దీక్షను పూర్తి చేసుకొని స్థానిక హరిహర పుత్ర అయ్యప్పస్వామి దేవాలయంలో రాజు గురు స్వామి వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములు ఆయన ఆశీర్వాదాలు పొంది కేరళ రాష్ట్రంలోని శబరిమలైకి తరలివెళ్లారు. పంపానది తీరాన వెలిసిన దేవ దేవుడు అయ్యప్పస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించి, మాల విరమణ గావించుకునేందుకు జనగామ శరత్‌ రావు గురుస్వామి ఆధ్వర్యంలో భక్తులు ముస్తాబాద్‌ నుండి బయలుదేరి వెళ్లారు. వీరిని కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సాదరంగా సాగనంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement