Sunday, May 5, 2024

చికిత్స పొందుతూ ఐకెపి వివోఏ మృతి..

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రానికి చెందిన ఐకెపి వీవోఏ మిరియాల్‌కార్‌ రూప (50) చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మరణించింది. ఎల్లారెడ్డిపేట ఐకెపిలో సిఏగా గత 20 ఏళ్లుగా పని చేస్తున్న రూప అందరికి నోట్లో నాలుకలాగా చనువుగా ఉంటూ మంచి తెచ్చుకుంది. గతంలో తెలుగుదేశం తరపున ఎంపిటిసిగా పోటి చేసి స్వల్ప మోజారిటో ఓటమి పాలైంది. గ్రామ సర్పంచ్‌గానూ పోటి చేసి ఓటమి పాలైంది. కుటు-ంబ ఆర్థిక పరిస్థితి కారణంగా రాజకీయంగా ఎదగలేకపోయి ఐకెపి వివోఏగానే కొనసాగుతోంది. భర్త శ్రీనివాస్‌ కాంగ్రెస్‌, టిడిపిలలో గతంలో క్రీయశీలకంగా పనిచేసి ప్రజాసమస్యల సాధన కోసం దంపతులు కృషి చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ టిఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. ఆరెకటికల సంక్షేమం కోసం పని చేస్తూ మండల కేంద్రంలో మటన్‌ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య రూప రెండు కిడ్నీలు చెడిపోగా వారం రోజుల క్రితం హైదరాబాద్‌ ప్రైవ్రేట్‌ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించాడు. చికిత్స కోసం రూ. 12లక్షల వరకు అప్పులు చేసినా రూప ప్రాణాన్ని కాపాడలేక పోయాడు. నిరుపేద కుటు-ంబానికి ప్రభుత్వం ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలని బిసి సంక్షేమ సంఘం జిల్లా అదికార ప్రతినిధి బండారి బాల్‌రెడ్డి, ఆరెకటిక సంఘం, గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement