Saturday, April 27, 2024

నిరాహార దీక్ష చేపట్టిన శేఖర్..

వేములవాడ: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు ద్వారా ఎన్నుకోబడిన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్‌బాబు నియోజకవర్గాన్ని విడిచి ఏడాది గడిచిందని వెంటనే ఎమ్మెల్యే వేములవాడ రావాలని పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో సామాజిక కార్యకర్త శేఖర్‌ సేనాపతి నిరాహార దీక్ష చేపట్టాడు. గత సంవత్సరం మార్చి 18న భారతదేశం నుండి జర్మనీకి వెళ్లిన రమేష్‌బాబు ఏడాదికాలంగా నియోజకవర్గానికి, ప్రజలకు అందుబాటులో లేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి-కై-నా ఎమ్మెల్యే రమేష్‌బాబు వెంటనే వేములవాడ నియోజకవర్గానికి చేరుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement