Saturday, May 4, 2024

KNR: ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీ..

ఆర్టీసీ బస్సును డీసీఎం వ్యాన్ ఢీ కొట్టిన సంఘటన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి మంచిర్యాలకు వెళ్తున్న డీసీఎం వ్యాన్ సుల్తానాబాద్ బస్టాండ్ నుండి బయటికి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.

అయితే ప్రయాణికులతో పాటు డ్రైవర్లకు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ నుండి బయటకు వచ్చే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే ఆర్టీసీ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement