Saturday, April 27, 2024

యుద్ధ ప్రాతిపదికన ఆర్‌ఓబీ పనులు : ఎంపీ వెంకటేశ్‌ నేత

పెద్దపల్లి, ఫిబ్రవరి 23 (ప్రభ న్యూస్‌) : రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కూనారం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులను పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి ఓవర్‌ బ్రిడ్జి పనులను నాణ్యతతో చేయాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటు-లో తీసుకువచ్చి ప్రజల ప్రయాణ భారాన్ని తగ్గించి సులభతరం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ కునారం రైల్వే గేటు వద్ద ప్రతినిత్యం వేలాది మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్‌ఓబీ నిర్మాణ పనులు పూర్తయితే వాహనదారుల కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement