Saturday, April 27, 2024

కరోనాతో సిరిసిల్ల అదనపు కలెక్టర్ మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో ఉన్న‌తాధికారిని బ‌లి తీసుకుంది. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ అంజ‌య్య‌(55) ప‌ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు హైదరాబాద్ న‌గ‌రంలోని ఓమ్నీ ఆస్ప‌త్రిలో చేర్పించారు. శ్వాస స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న అంజ‌య్య‌.. చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. అంజ‌య్య మృతిప‌ట్ల రాజ‌న్న సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌రేట్ సిబ్బంది సంతాపం ప్ర‌క‌టించింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement