Saturday, May 4, 2024

‘యాస్’ తుఫాను: వైద్యాధికారులను అప్రమత్తం చేసిన మంత్రి

‘యాస్’ తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. యాస్ తుపాన్ ప్రభావిత జిల్లాల యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల డీఎంహెచ్ఓలు, డీసీహెచ్ఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ తో మాట్లాడారు. కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ముందుగా సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు వల్ల ఎలాంటి అంటూ వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో డాక్టర్స్, వైద్య సిబ్బంది హాస్పిటల్స్ లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

స్పెషలిస్ట్ వైద్యులతో రాపిడ్ రెస్పాన్స్ మెడికల్ టీమ్స్ కూడ సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావం కారణంగా వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని డీఎంహెచ్ఓలకు ఆదేశించారు. ప్రతి మూడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో ఒక స్పెషల్ మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్, త్రాగునీరు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని అదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు ఆర్డీ కిట్స్, ఇతర మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. తుపాన్ ప్రభావిత ప్రాంతంలో ప్రతి రిలీఫ్ కేంద్రం వద్ద ఒక ANM, MPHA, సూపర్ వైజర్, ఆశా వర్కర్లు తో మెడికల్ క్యాంపు తక్షణమే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి 104,108 అంబులెన్సు లు సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.

ఇది కూడా చదవండి : సోషల్ మీడియా లో పోస్ట్ లు….సీఐడీ దర్యాప్తు!!

Advertisement

తాజా వార్తలు

Advertisement