Monday, April 29, 2024

రైతును రాజును చేసేందుకే రైతు బంధు : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

అన్నం పెట్టే అన్నదాతను రాజును చేసేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో రైతుబంధు చేస్తున్నారని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లిలో ఎడ్లబండి ర్యాలీ నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ… గత ప్రభుత్వాల హయాంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే వారని, 2014లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆత్మహత్యలు ఆగిపోయాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు ప్రవేశపెట్టి ఇప్పటికే ముందస్తు పెట్టుబడి కింద రైతులకు 50 వేల కోట్ల రూపాయలు జమ చేశారన్నారు. కాలేశ్వరం జలాలతో రైతులకు సాగునీటి కొరత లేకుండా పోయిందన్నారు. సంబరాల్లో ఎంపీపీ సంపత్, జడ్పిటిసి తిరుపతి రెడ్డితో పాటు తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement