Friday, April 26, 2024

ట్రాక్ట‌ర్ ను ఢీకొట్టిన బైక్ : ముగ్గురు మృతి

ట్రాక్ట‌ర్ ను బైక్ వెనుక నుండి ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో బైక్ వై వెళ్తున్న ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందిన విషాధ ఘ‌ట‌న నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం …. దామరచర్ల మండల పరిధిలోని అద్దంకి-నార్కెట్ ప‌ల్లి హైవేపై.. బోత్తులపాలెం వద్ద వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బైక్ నుజ్జునుజ్జయింది.
ఈఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వాడపల్లి పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరు వాడపల్లి గ్రామానికి చెందిన అంజి(21), అంజలి(17)లు అన్నాచెల్లెలు.. వారి మేనల్లుడు నవదీప్ (8)గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement