Saturday, April 27, 2024

TS: ఎన్నికల డ్యూటీలో మరణిస్తే పరిహారం పెంపు

ఎన్నికల విధుల్లో మరణించే వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి అనుగుణంగా జీవో ఇచ్చింది. ఎన్నికల డ్యూటీలో మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తుండగా.. దాన్ని రూ.15 లక్షలకు పెంచారు. ఎన్నికల విధుల్లో తీవ్రవాదులు లేదా అసాంఘిక శక్తుల చర్యల వల్ల చనిపోతే ఇచ్చే రూ.20 లక్షలను రూ.30 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవైకల్యం ఏర్పడే వారికి రూ.7.50 లక్షలు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement