Wednesday, May 1, 2024

మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం : ఎమ్మెల్యే దాసరి

ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి పట్టణంలోని 7వ వార్డులో పట్టణ-ప్రగతి, మున్సిపల్ సాధారణ నిధులు రూ.50.26 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల పరిధిలోని వార్డులతో పాటు గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి, కౌన్సిలర్ కనకలక్ష్మీ-శ్రీకాంత్, ఛైర్మెన్ మాదిరెడ్డి నరసింహా రెడ్డి, కౌన్సిలర్ లు గాదె మాధవి, పూదరి చంద్రశేఖర్, పైడ రవి అష్రఫ్, వార్త శ్రీధర్, చిరంజీవి, పెద్ది వెంకటేష్, రేవెళ్లి స్వామి, కో ఆప్షన్ లు ఫహీం, చంద్రమోగిళి, తెరాస నాయకులు కనకయ్య, వెన్నం రవి, అజీజ్, అఖిల్, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement