Sunday, April 28, 2024

ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించాలి : పెద్ద‌ప‌ల్లి కలెక్టర్‌ సంగీత

  • నూతన కలెక్టరేట్‌లో అర్జీల స్వీకరణ
    పెద్దపల్లి : ప్రజావాణిలో వచ్చే అర్జీలను పరిశీలించి సత్వరమే సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌లో తొలిసారిగా కలెక్టర్‌ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించే దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలన చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, ప్రజావాణిలో వచ్చే అర్జీలపై ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారి తనంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మినారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement