Wednesday, March 27, 2024

లంగ‌ర్ హౌస్‌లో దారుణ హ‌త్య‌..

పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో హత్య నగరంలో కలకలం రేపుతోంది. లంగర్‎హౌస్‎లో షేక్ ఫరీద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆటోలోని మృతదేహన్ని స్థానికులు గ‌న‌మించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇంట్లో హత్య చేసి మృతదేహాన్ని ఆటోలో వదిలి వెళ్లారా అనే కోణంలో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement