Friday, April 26, 2024

పీపీఎల్ విజేత పెద్దపల్లి.. ఫలితం తేల్చిన సూపర్ ఓవర్..

ఉత్కంఠ భరితంగా సాగిన పెద్దపల్లి ప్రీమియర్ లీగ్ పోరులో పెద్దపల్లి పోలీస్ జట్టు విజయం సాధించింది. ఆదివారం పెద్దపెల్లి జిల్లా మంథని జేఎన్టీయూ కళాశాల మైదానంలో జరిగిన ఫైనల్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన పెద్దపల్లి జట్టు నిర్ణీత 15 వార్లలో 136 పరుగులు చేయగా, రెండవ బ్యాటింగ్ చేసిన సుల్తానాబాద్ జట్టు నిర్నిత 15 వార్లలో 136 పరుగులు చేయడంతో డ్రాగా ముగిసి ఫలితం తేల్చెందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ లో సుల్తానాబాద్ జట్టును మూడు పరుగులకే పరిమితం చేశారు. పెద్దపల్లి జట్టు 5 బాల్స్ లో ఐదు పరుగులు చేసి పీపీఎల్ విజేతగా నిలిచింది. విజేత పెద్దపల్లి పోలీస్ జట్టుకు డీసీపీ రూపేష్ ట్రోఫీని అందజేశారు. రన్నర్ ట్రోఫీని సుల్తానాబాద్ జట్టుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు గిరి ప్రసాద్, సారంగపాణి, బాలరాజు ఇన్ స్పెక్ట‌ర్లు సతీష్, ప్రదీప్, అనిల్, ఇంద్రసేనారెడ్డి, రమేష్, చంద్రశేఖర్, వేణుగోపాల్, ప్రవీణ్, ప్రసాద్, అఫ్జల్ లతోపాటు ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement