Wednesday, April 24, 2024

ఫారెస్ట్‌ అధికారికి నెమలి అప్పగింత

చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోని వరికోల్ పల్లి శివారులో నిస్సాయక స్థితిలో ఉన్న జాతీయ పక్షి నెమలి ఆదివారం గోలి నాగరాజు రైతు కంటపడింది. దీంతో వరికోల్ పల్లి సర్పంచి సాంబయ్య , జడ్పిటిసి గొర్రె సాగర్ లు ఫారెస్ట్ అధికారుల‌కు ఫోన్ ద్వారా స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డికి చేర‌కున్న ఫారెస్ట్ అధికారులకు నెమలిని
అప్ప‌గించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, నెమలికి వైద్య పరీక్షలు నిర్వహించి వనవిజ్ఞాన కేంద్రానికి తరలించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement