Sunday, April 28, 2024

రైల్వే స్టేషన్‌లలో పోలీసు బందోబస్తు

ఓదెల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు నిరసనగా ఆర్మీ నిరుద్యోగ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో చేసిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఓదెల మండలం పొత్కపల్లి ఎస్సై శీలం లక్ష్మణ్‌ పోలీస్‌ సిబ్బందితొ కలిసి బందోబస్తు చేపట్టారు. శుక్రవారం ఓదెల మండల పరిధిలోని పొత్కపల్లి, ఓదెల, కొలనూర్‌ రైల్వేస్టేషన్లలో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై లక్ష్మన్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement