Monday, April 29, 2024

అగ్నిప‌థ్ ఎఫెక్ట్ : సికింద్రాబాద్‌ స్టేషన్ నుంచి రైళ్లు రద్దు

అగ్నిప‌థ్ ఆందోళ‌న‌లు భారీ ఉద్రిక్త‌త‌కు దారితీశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. మూడు రైళ్లకు నిప్పంటించడంతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారిపోయింది. రైల్వే ప్రయాణీకులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌వైపు వచ్చే రైళ్లను పూర్తిగా రద్దుచేశారు. 300 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. మరో 44 ఎంఎంటీఎస్‌ సర్వీసులను నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement