Monday, April 29, 2024

పోలీసు నిర్భంధంలో మల్లంపల్లి.. అర్ధరాత్రి పలువురు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ములుగు జిల్లా  పర్యటనను నేపథ్యంలో మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. నూతన మండలం ఏర్పాటు కోసం కొట్లాడుతున్న మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని నిర్భందించారు. ప్రజాస్వామ్యనికి విరుద్ధంగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజును, సహాయ కార్యదర్శి ఎడ్ల అనిల్ రెడ్డీలను తమ ఇంటి నుండి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. అంతకుముందు సాధన సమితి నాయకులు కార్యదర్శి చంద్రయ్య, నాయకులు చంద రాము, కుక్కల సంపత్, గాజు అజయ్,  సిహెచ్ శ్రీకాంత్ రెడ్డి, తాళ్ల పెళ్లి సాంబయ్యను అరెస్ట్ చేసి ములుగు స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement