Friday, April 26, 2024

నందికొట్కూరును క‌ర్నూలు జిల్లాలో చేర్చాల‌ని బైరెడ్డి దీక్ష

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి క‌ర్నూలు జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ ధర్నా చౌక్ వద్ద ప్రజా నిరసన దీక్ష చేశారు. ఈసంద‌ర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ… డోన్, ఆదోనిని జిల్లాలుగా చేయాలని, నందికొట్కూరును కర్నూలు జిల్లాలో చేర్చాలని ఆయ‌న డిమాండ్ చేశారు. పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలన్నారు. మూడు రాజధానుల తీర్పు మాదిరిగానే జిల్లాల విభజన కూడా జగన్‌కు షాక్ తగులుతుందని అన్నారు. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం తగదన్నారు. సంక్షేమ పథకాలే జగన్‌ను పాతాళానికి తీసుకెళ్తాయని దుయ్యబట్టారు. వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని, కేవలం గడ్డ మాత్రమే మిగిలిందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement