Thursday, April 25, 2024

పార్టీ బలోపేతానికి సైనికుల్లా పని చేయాలి..

వేములవాడ: కాంగ్రెస్‌ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోనరావుపేట్‌ మండల అధ్యక్షులు షేక్‌ ఫిరోజ్‌ పాషా పిలుపునిచ్చారు. మండలంలోని రామన్నపేట గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీని నియమించారు. అధ్యక్షుడుగా ఎర్ర ఆగేష్‌, ఉపాధ్యక్షులుగా ములిగే మల్లయ్య, జనరల్‌ సెక్రటరీగా చల్ల అంజయ్య, ప్రచార కార్యదర్శిగా దుద్దేటి దేవరాజు, కోశాధికారి పండుగ లావణ్యలను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు కచ్చకాయల ఎల్లయ్య, తాళ్లపెల్లి ప్రభాకర్‌, మండల నాయకులు గడిపెల్లి ఎల్లయ్య, బిగుల్ల బాబు, రేకుల లక్ష్మారెడ్డి, కళ్యాణ్‌, బంటు రాజేందర్‌, వంగపెల్లి శోభన్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement