Wednesday, May 1, 2024

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి గంగుల

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయ‌ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి లతో కలిసి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయని… రోడ్ల మీద నీళ్ళు నిలువకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement