Saturday, April 27, 2024

TS : రాజన్నను దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే

తెలంగాణలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి పేరొందిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరీ స్వామిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

- Advertisement -

అనంతరం ఆలయ ఆర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామీ వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement