Thursday, April 25, 2024

TS : నేడు తెలంగాణ బంద్‌…ఏజెన్సీలో పోలీసుల గ‌స్తీ..

ఇవాళ తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. ఇటీవల గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు తెలంగాణ బంద్ కు పిలుపు నిచ్చారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు పోలీసు ఎస్కార్ట్ కల్పిస్తున్నారు.

- Advertisement -

మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో అనేకచోట్ల పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పహరా కాస్తున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. పోలీసు బందోబస్తు తీవ్రతరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement