Sunday, May 5, 2024

రైతు దీక్షలో పెద్దపల్లి ప్రజాప్రతినిధులు

తెలంగాణ రైతాంగం పండించిన ప్రతిదాన్ని ఒక గింజను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో తలపెట్టిన నిరసన దీక్షలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రైతు పండించిన ప్రతీ ధాన్యపు గింజలు కేంద్రమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను కన్నీరు పెట్టించిన వారెవరు బాగు పడలేదని, రాబోయే కాలంలో కేంద్రంలోని రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని కర్షక లోకమే గద్దె దింపుతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement