Wednesday, April 24, 2024

శ్రీవారిని దర్శించుకున్న కేజీఎఫ్-2 చిత్ర బృందం

కన్నడ హీరో, రాక్‌స్టార్‌ యశ్‌, కేజీఎఫ్‌ 2 చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏప్రిల్‌ 14న కేజీఎఫ్‌ 2 విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ టీం తీర్థ యాత్రలతో బిజీగా ఉంది. కేజీఎఫ్-2 చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తిరుపతికి వచ్చిన యష్ స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం వీఐపీ దర్శనంలో కేజీఎఫ్‌ 2 హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, మూవీ టీం స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంత‌రం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా.. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement