Tuesday, May 7, 2024

ప్రజల భద్రతే పోలీస్‌ శాఖ లక్ష్యం

ప్రజల భద్రతే పోలీస్‌ శాఖ లక్ష్యమని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. సోమవారం ఏసీపీ కార్యాలయంలో పెద్దపల్లి, సుల్తానాబాద్‌ సర్కిల్‌ పరిధిలో ప్రజల భద్రత, అత్యవసర సేవల కోసం 24 గంటల నిరంతరం పెట్రోలింగ్‌ వాహనాలను అందుబాటులో ఉంచేందుకు హైవే పెట్రోలింగ్‌ వాహనాలను ఏసీపీ సారంగపాణి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పెట్రోలింగ్‌ సిబ్బంది పెద్దపల్లి, సుల్తానాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని ఎస్సైలు, బ్లూ క్లోట్స్‌ సిబ్బంది, టోయింగ్‌ వెహికల్‌ సిబ్బంది, హెచ్‌కేఆర్‌ పెట్రోలింగ్‌ సిబ్బందితో కలిసి పని చేస్తారన్నారు. లోకల్‌ అంబులెన్సు, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పరిధిలో ఉన్న ఆస్పత్రి వారితో సమన్వయం చేస్తూ లాఅండ్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తిన సమయంలో అత్యవసర సేవలకు, నేరాలు, ప్రమాదాలు జరిగిన సమయంలో సేవలందిస్తాయన్నారు. ట్రాఫిక్‌ సమస్య ఏర్పడినా వెంటనే స్పందించి ప్రజల రక్షణ, భద్రతతోపాటు వారు గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే ప్రధాన లక్ష్యంగా అందుబాటులోకి తెచ్చామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement