Saturday, May 4, 2024

నిఘా నేత్రాల నీడలో పెద్దపల్లి.. నేరాల నియంత్రణకి పటిష్టమైన చర్యలు : సీపీ చంద్రశేఖర్ రెడ్డి

పెద్దపల్లి జిల్లా కేంద్రం నిఘా నేత్రాల నీడలో ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి ప్రధాన కూడళ్లలో అత్యాధునిక టెక్నాలజీ తో ఏర్పాటు చేసిన 51 సిసి కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా తక్షణమే స్పందించేలా పట్టణం మొత్తం నూతనంగా 51 సీసీ కెమెరాలు గౌరెడ్డిపేట క్రాస్ రోడ్, అయ్యప్ప చౌరస్త, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, బస్టాండ్ చౌరస్తా, పరమేశ్వర ఎలక్ట్రికల్స్, రంగంపల్లి, కూనరం రోడ్డు చౌరస్తా, కాకతీయ టెక్నో స్కూల్ మజీద్ చౌరస్తా ఈస్ట్, జెండా చౌరస్తా, గణేష్ హాస్పిటల్, సెయింట్ ఆన్స్, సుభాష్ స్టాచ్, ఎల్లమ్మ టెంపుల్, నిట్టూరు రోడ్డు, శివాలయం, ట్రినీటి కెనాల్, మైత్రి కాలనీ, కూనారం రోడ్, రంగంపల్లి కోర్ట్ హైవే, చీకురాయి, హాస్పిటల్, శాంతినగర్ పెట్రోల్ పంప్, బంధంపల్లి ఫ్లై ఓవర్, మజీద్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, పోలీస్ స్టేషన్, బాల హనుమాన్, సుభాష్ నగర్, శాంతినగర్ కెనాల్, తెనుగువాడ లలో కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన 51 సిసి కెమెరాల తో పాటు గతం లో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 330, ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో 52, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 196, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 384, కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 53, జూలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 36, పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 138, మొత్తం పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో 1190 నిఘా నేత్రల నీడ లో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై పోలీసు శాఖ దృష్టి సారించిందన్నారు.

పట్టణం లో ఈ కెమెరాలు నిరంతరం 360 డిగ్రీల్లో తిరుగుతూ ప్రతీ దృశ్యాన్ని రికార్డు చేస్తాయని అన్నారు. వీటి ద్వారా వంద మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన వెంటనే గుర్తించి పరిష్కరించవచ్చు. రాత్రి వేళల్లోనూ దృశ్యాలను స్పష్టంగా చిత్రీకరిస్తాయని నేరస్తులను గుర్తించడానికి, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి ఈ కెమెరాలు ఉపయోగపడుతాయన్నారు. పెద్దపల్లి లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పోలీసుస్టేషన్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. క్రైం, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల నుంచి పోలీస్ సిబ్బందిని కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషిస్తుంటారని అన్నారు. వీటి ద్వారా వంద మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన వెంటనే గుర్తించి పరిష్కరించవచ్చు. నేరాలపైనే ప్రత్యేక దృష్టితో పాటు ట్రాఫిక్ సమస్యలపై నిఘా పెడుతూ విధుల్లో ఉన్న ట్రాఫిక్, పోలీస్ సిబ్బందికి కంట్రోల్ రూం ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ పరిస్థితులను అదుపు చేసేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జోన్ ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్, ఎసిపి సారంగపాణి, పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు రాజేష్, మౌనిక, సహదేవ్ సింగ్, రవీందర్, మహేందర్, ఉపేందర్, శివాని,లక్ష్మణ్, వెంకటకృష్ణ, రాజవర్ధన్ పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement