Friday, May 10, 2024

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి… రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దపెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్, ఎస్సైలు రాజేష్, ఉపేందర్, మహేందర్, వెంకటకృష్ణ, లక్ష్మణ్, రాజవర్ధన్, శివాని, మౌనిక, సహదేవ్ సింగ్, రవీందర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement