Wednesday, May 8, 2024

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పెద్దపెల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని పోత్కపల్లి పోలీస్స్టేషన్ ఆవరణలో రహదారి భద్రత గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం ప్రాణాంతకమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, పరిమితి లోపే వాహనాల్లో ప్రయాణం చేయాలన్నారు. సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, రవాణా శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్ కుమార్, అనిల్, ఎస్ఐ లు లక్ష్మణ్, వెంకటేష్, ఉపేందర్, రాజేష్, వెంకటకృష్ణ, శ్రీనివాస్, శివాని, మౌనిక తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement