Sunday, May 5, 2024

సీఎం కేసీఆర్, మంత్రి గంగుల చిత్రపటాలకు పాలాభిషేకం..

కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్ గ్రామం నుండి గుంటూరు పల్లి గ్రామం వరకు రోడ్డు మార్గం అభివృద్ధి కోసం 1,86,33000 రూపాయల నిధులను మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లకు దుర్షెడ్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావులు మాట్లాడుతూ.. రోడ్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన కేసీఆర్ కి కరీంనగర్ గ్రామాలను అభివృద్ధి ప‌థంలో తీసుకుపోతున్న గంగుల కమలాకర్ కి గ్రామ ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. BRS ప్రభుత్వంలో రాష్ట్రo అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ పాలన ద్వారా ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రo ముందుకు దూసుకుపోతుంది. గ్రామాలు అభివృద్ధి అయితేనే రాష్ట్రo ప్రగతి పాదంలో వెళ్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, గ్రామ BRS శాఖ అధ్యక్షులు శ్రీరాంమోజ్ తిరుపతి, BRS కరీంనగర్ రూరల్ యూత్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య, BRS నాయకులు రాజుకమల్, పూదరి మహేష్ గౌడ్, నేరెళ్ల మహేష్, తిరుపతి, కిట్టు, లక్షణ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement