Wednesday, April 24, 2024

మరో హార్రర్ థ్రిల్లర్ మూవీలో.. ఆది పినిశెట్టి

మరోసారి వైశాలి మూవీ కాంబినేషన్ లో శబ్దం మూవీ తెరకెక్కనుంది. కాగా సెవెన్ జీ ఫిలిమ్స్ – ఆల్ఫా ఫ్రేమ్స్ వారు సంయుక్తంగా నిర్మించిన చిత్రం శ‌బ్దం. అరివళగన్ దర్శకత్వం వహించారు. అరుణ్ పద్మనాభన్ ఫొటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాకి జోసెఫ్ ఎడిటర్ . ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. హీరో ఆది పినిశెట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, తెలుగు – తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. తెలుగులో ‘శబ్దం’ అనే టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చెవి .. గబ్బిలాల నేపథ్యంలో డిజైన్ చేసిన టైటిల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో అరివళగన్ – ఆది పినిశెట్టి కాంబినేషన్ లో ‘వైశాలి’ అనే హారర్ థ్రిల్లర్ వచ్చింది. నీటిని ప్రేతాత్మ ఆవహించి ప్రతీకారం తీర్చుకోవడమనే కాన్సెప్టుతో వచ్చిన ఆ సినిమా, తమిళ .. తెలుగు భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకి కూడా తమన్ పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement