Thursday, May 2, 2024

భక్తిశ్రద్ధలతో నిమజ్జనంలో పాల్గొనాలి.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గణపతి నిమజ్జనోత్సవం లో ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పాల్గొనాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మినీ ట్యాంక్ బండ్ వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొదటి వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించే నవరాత్రి వేడుకలు నిమజ్జనోత్సవంతో ముగుస్తాయన్నారు.

శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ ఆనందంగా పాల్గొనాలని, నిమజ్జనం సందర్భంగా ఎవరు నీటిలోకి దిగవద్దన్నారు. భారీ క్రేన్లు ఏర్పాటు చేశామని మున్సిపల్ సిబ్బంది ఉత్సవ సమితి లకు సహకరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత, కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్ సరేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement