Wednesday, April 24, 2024

రామ్‌ చరణ్ మూవీలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ స్టార్‌ డైరెక్టర్‌!

శంకర్ డైరెక్ష‌న్ లో రామ్‌ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న‌ హై బ‌డ్జెట్ మూవీ #RC15.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది. ఈ సినిమాలో నటించే ప్రతినాయకుడి గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ద‌ర్శ‌కుడిగా కెరీర్ మొద‌లుపెట్టి ఆపై యాక్ట‌ర్‌గా మారాడు ఎస్.జే సూర్య‌. స్పైడర్, అదిరింది, మనాడు సినిమాల్లో హీరోయిజంతో పాటు విలనిజం కూడా బాగా ఎలివేట్ అయింది. ప్రతినాయకుడి పాత్రలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్.జే సూర్య నటించిన తీరు ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది.. రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న సినిమాలో ఎస్‌.జే సూర్య కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. కాగా, ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి ఆయ‌న ఈ సినిమా షూటింగ్‌లో భాగ‌మ‌య్యారు. రామ్ చ‌ర‌ణ్‌కు ధీటుగా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుందని చెబుతున్నారు. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక మూవీలో ఎస్.జే సూర్య విలన్ రోల్ చేయడం ఆసక్తికరంగా మారింది.

పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాలో ఎస్.జే సూర్య ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడని కోలీవుడ్ టాక్. ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విన‌య విధేయ రామ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వాణీ జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇది. శ్రీకాంత్‌, న‌వీన్‌చంద్ర కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement