Sunday, May 5, 2024

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి : మంత్రి గంగుల

దేశభక్తి పెంపొందే విధంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం వజ్రోత్సవాల నిర్వహణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేలుకొలిపేలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా వీటిని నిర్వహించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని.. ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులు.. ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 3,08,427 గృహాల పై జాతీయ జెండాలను ఎగురవేయలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా’న్ని ఘనంగా నిర్వహించనున్నదని మంత్రి వెల్లడించారు. జిల్లాలో ఈ నెల 8 నుంచి 20వరకు నిర్వహించే కార్యక్రమాల విజయవంతం లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యేవిధంగా అధికారులు చోరువ తీసుకోవాలని పిలుపునిచ్చారు..

ప్రతి ఇంటిపై జాతీయ జెండా..
ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమ విజయవంతానికి అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 9వ తేదీ నుంచే జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీని చేపట్టాలని సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలని పేర్కొన్నారు.

ఆగస్టు 8న ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం
వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని ఆగస్టు 8న ప్రారంభమవుతుందని ఇందులో భాగంగా ఆర్మీ/పోలీస్‌ బ్యాండ్‌తో రాష్ట్రీయ శాల్యూట్‌.. జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను నిర్వహించాలని ఆదేశించారు..వజ్రోత్సవాలలో భాగంగా ఈనెల 11 న ఫ్రీడం రన్ అంబెడ్కర్ స్టేడియం నుండి తెలంగాణ చొక్ వరకు 50,000 మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు .. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్ నగర మేయర్ వై సునీల్ రావు అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్ ,శ్యామ్ ప్రసాద్ లాల్ ,జడ్పీ చైర్మన్ కనమల విజయ ,అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ నగర పాలక సంస్థ కమీషనర్ సేవా ఇస్లావత్ , మున్సిపల్ చైర్మన్లు కమిషనర్లు అధికారులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement