Thursday, May 2, 2024

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. మంత్రి కొప్పుల ఈశ్వర్

స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతియ జెండా ఎగరాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ వరకు వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే వేడుకలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement