Sunday, April 28, 2024

సాగుకు స‌న్నాహ‌క స‌మావేశంలో పాల్గొన్న మంత్రులు

కరీంనగర్ పట్టణంలోని వి కన్వెన్షన్ హాలులో సోమవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన వానాకాలం -2022 సాగుకు సన్నాహక సమావేశం నిర్వ‌హించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ల‌తో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఎమ్మెల్యేలు రసమయి బాల్ కిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement