Thursday, March 28, 2024

బాలిక‌పై ముస‌లోడి అఘాయిత్యం, పొద‌ల‌చాటుకు లాక్కెళ్లి మ‌రీ.. చిత్తూరు జిల్లాలో ఘ‌ట‌న‌

చిత్తూరు జిల్లాలో రోజు రోజుకు లైంగిక దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పసికందుల వద్ద నుండి పండు ముసలి వరకూ వావివరుస తేడా లేకుండా మృగాళ్లు తమ కామావాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వృద్దుడు 9 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా కేంద్రంలోని సీబీ రోడ్డులో నివాసం ఉండే ధనపాల్ (58) రోజువారి కూలీ‌ పనులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. పనులు పూర్తి అయ్యాక మద్యం సేవించి ఇంటికి చేరుకన్న ధనపాల్ కుటుంబ సభ్యులతో తరచూ గొడవకు దిగేవాడు. దీంతో కుటుంబ సభ్యులు అత‌డిని పెద్దగా పట్టించుకునే వారు కాదు.

అయితే కుటుంబానికి దూరంగా ఉండడంతో తన ఇంటికి సమీపంలో ఉండే తొమ్మిదేళ్ల‌ బాలికపై ధనపాల్ కన్నేశాడు. ఈ క్రమంలో యథావిధిగా రెండు రోజుల క్రితం కూలీ పనులకు వెళ్లిన ధన్ పాల్ అర్థాంతరంగా ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఆ త‌ర్వాత ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి వెళ్లే సమయంలో తొమ్మిదేళ్ల‌ బాలిక కనిపించింది. బాలికతో మాటమాట కలిసి తినుబండాలు కొనిస్తాన‌ని మాయమాటలు చెప్పాడు. తాగిన మైకంలో మనవరాలి వయస్సులో ఉన్న బాలికను ఇంటికి సమీపంలో ఉన్న పొదల మాటుకు తీసుకెళ్లాడు. బాలికపై పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ధనపాల్ వికృత చేష్టలను భరించలేని బాలిక గ‌ట్టిగా కేకలు వేస్తూ వృద్దుడి‌ నుండి తప్పించుకుని పొదల నుండి ఇంటికి‌ పరుగులు తీసింది. స్ధానికులు అక్క‌డికి చేరుకుని ధనపాల్ దేహశుద్ది చేసి చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ధనపాల్ ను అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement