Sunday, May 5, 2024

పేదల సంక్షేమమే ధ్యేయం-మంత్రి కొప్పుల

కరీంనగర్‌ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని రాష్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన ఎం. వర్షితకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 35వేల చెక్కును ఆమె తండ్రి లచ్చయ్యకు మంత్రి కొప్పుల అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆపద సమయంలో సీఎం సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తుందని, ఆర్థిక భరోసా ఇస్తూ ఆదుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్‌ నిరంతరం పేద ప్రజల కోసమే పని చేస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement