Saturday, April 27, 2024

ఈతకు వెళ్లి వలస కూలీల గల్లంతు

ఈతకు వెళ్లి వలస కూలీలు గల్లంతైన సంఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం చందపల్లి శివారులో చోటుచేసుకుంది. ఆదివారం చతిస్గఢ్ కు చెందిన వలస కూలీలు చందర్ పెళ్లి శివారులోని ఎస్సారెస్పీ డి 83 కెనాల్ లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. చతిస్గడ్ కు చెందిన కేతు సింగ్ మెరావి(27), ప్రహ్లాద్ మెరావి(35) లు చందపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ గృహ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నట్లు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ తెలిపారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement