Monday, April 29, 2024

క్రీడలతో మానసికోల్లాసం: రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి

క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి ప్రీమియర్ లీగ్ లో భాగంగా పెద్దపల్లి, మంథని జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి జోన్ పరిధిలోని 6 జట్లు ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటున్నాయన్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది క్రీడా పోటీల వల్ల ఒత్తిడి నుండి బయటకు వస్తారన్నారు. క్రీడాకారులు గెలుపోవటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రూపేష్, ఏసీపిలు సారంగపాణి, గిరిప్రసాద్, సిఐలు ప్రదీప్ కుమార్, సతీష్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, వేణుగోపాల్, చంద్రశేఖర్, రమేష్ తో పాటు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement