Monday, April 29, 2024

మేడేను విజయవంతం చేయండి

పెద్దపల్లి: మేడేను విజయవంతం చేయాలని ఇఫ్టూ నాయకులు వేల్పుల అంజయ్య, పీవైఎల్‌ జిల్లా కార్యదర్శి లింగమూర్తిలు పేర్కొన్నారు. మంగళవారం 135వ మేడే ఉత్సవాల పోస్టర్లను పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద వారు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. చికాగో కార్మిక అమరవీరుల స్ఫూర్తితో కార్మికులంతా హక్కుల సాధన కోసం పోరాటం చేయాలన్నారు. పాలకుల తీరుకు నిరసనగా హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించాలన్నారు. శ్రమ దోపిడీ, హక్కులను రాసే చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం సాగించాలన్నారు. మేడేను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు అనుబంధ హమాలి సంఘం నాయకులు తిరుపతి, గుర్రాల శ్రీనివాస్‌, వేల్పుల బాబు, పల్లె రాములు, శ్రీనివాసు, ఓదెలు, పి రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement