Thursday, May 2, 2024

ఏపీలో రేపు మంత్రుల కీలక సమావేశం

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఈ కమిటీకి ఆళ్ల నాని కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై పర్యవేక్షణ కోసం ఏపీ సర్కారు ఐదుగురు మంత్రులతో ఇటీవలే కమిటీ వేసింది. ఆళ్ల నాని కన్వీనర్ కాగా… బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాగా రేపటి సమావేశంలో కీలకమైన అంశాలను చర్చిస్తామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, రెమ్ డెసివిర్ అంశాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. మంత్రుల కమిటీ గత నెలలోనూ సమావేశమై కోవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement